మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ లో ఉంటూనే, కష్ట సమయాల్లో ప్రజలకు తోచిన సహాయం చేస్తున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ను పెట్టబోతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ మరియు మిష్టర్ చిరంజీవి వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ను మరియు వెబ్ సైట్ ను రేపు ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వద్ద మొదలు పెట్టనున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన విషయాలను మీడియా తో వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హాజరు కానున్నారు. పలు కార్యక్రమాల్లో తండ్రికి చేదోడు గా ఉన్న రామ్ చరణ్ ఈ కార్యక్రమం లో పాల్గొనటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?