రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం

రామోజీ ఫిలిం సిటీలో అల్లు అర్జున్-త్రివిక్రమ్ చిత్రం

Published on Jan 22, 2012 10:09 PM IST

అల్లు అర్జున్ మరియు ఇలియానా జంటగా నటిస్తున్న కొత్త చిత్రం రేపటి నుండి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభంకానుంది. అల్లు అర్జున్ మీద ఒక రెయిన్ ఫైట్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఇలియానా జంటగా నటించడం ఇదే మొదటిసారి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యూనిట్ వర్గాల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇలియానా త్రివిక్రమ్ తో కలిసి గతంలో ‘జల్సా’ చిత్రంలో నటించింది. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. డివివి దానయ్య సమర్పిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు