చిరంజీవి ని వెనకేసుకొచ్చిన అల్లు అర్జున్

చిరంజీవి ని వెనకేసుకొచ్చిన అల్లు అర్జున్

Published on Nov 23, 2011 6:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి ని వెనకేసుకురావటం ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వంతు అయ్యింది. ఇటీవల జరిగిన పంజా చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి హాజరు కాకపోవటం పెను దుమారాన్ని లేపుతోంది. మెగా సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయి అని జోరు గా పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అల్లు అర్జున్ ఈ పుకార్లను తీవ్రం గా ఖండించాడు.

“మా కుటుంబం లో నలుగురు కి పైగా హీరోలు ఉన్నారు . ఏడాదికి చాలా చిత్రాలు విడుదల అవుతూ ఉంటాయి. అయితే ప్రతి ఫంక్షన్ కి అందరూ రావటం ఒక్కోసారి వీలుపడక పోవచ్చు. అంత మాత్రాన కుటుంబం లో వివాదాలు ఉన్నాయంటే ఎలా ? నేను విపరీతమైన ట్రాఫిక్ వలన రాలేకపోయాను.చిరంజీవి గారు ఒక ముఖ్యమైన రాజకీయ కార్యక్రమం వలన రాలేకపోయారు. ఆయన స్వంత తమ్ముడి ఫంక్షన్ కి కావాలని రాకుండా ఎందుకు ఉంటారు? పవన్ కళ్యాణ్ మాకు అందరికీ ఎంతో ఇష్టమైన, కావాల్సిన వ్యక్తి ” అని అల్లు అర్జున్ అన్నారు

ఇటీవలే నాగబాబు కూడా ఇదే విషయం పై తీవ్రం గా స్పందించారు. పవన్ కళ్యాణ్ పంజా చిత్రం డిసెంబర్ 9 న భారీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పై మంచి ఉత్సాహం ఫాన్స్ లో కనబడుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు