ఎన్.టి.ఆర్ కోర్టు కేసు కొట్టివేత

ఎన్.టి.ఆర్ కోర్టు కేసు కొట్టివేత

Published on Dec 17, 2011 9:56 PM IST

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. నేడు సూర్యాపేట లోని ప్రత్యేక లోక్ అధలట్ కోర్టుకు హాజరు అయ్యారు. 2009 లో ఎన్.టి.ఆర్. ఎన్నికల ప్రచారం నుండి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా, అయన ప్రయాణిస్తున్న నల్ల టాటా సఫారి కారు ప్రమాదానికి గురయ్యింది. ఆయనకు ఈ ప్రమాదం లో కాలు విరిగింది. పోలీసులు ఆయన డ్రైవెర్ సూరపనేని ఉదయ కుమార్ పై కేసు నమోదు చేసారు.

ఈ కేసు కు సంబంధించి నేడు ఎన్.టి.ఆర్. ఒక సాక్షి గా కోర్టుకు హాజరు అయ్యారు. ఆయన సాక్ష్యం విన్న అనంతరం కేసును లోక్ అదాలత్ కొట్టివేసింది. ఎన్.టి.ఆర్. కోర్టులో అయిదు నిముషాలు ఉన్నారు. అయన వస్తున్నారు అని తెలిసి భారీ గా అభిమానులు తరలి రావటం తో పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేయవలసి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు