ఏప్రిల్ లో నాగార్జున-దశరద్ చిత్రం

ఏప్రిల్ లో నాగార్జున-దశరద్ చిత్రం

Published on Nov 30, 2011 1:57 AM IST

అక్కినేని నాగార్జున బిజీ బిజీగా మారిపోయారు. ఆయన నటించిన రాజన్న చిత్రం డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన దశరద్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సంతోషం’ భారీ విజయం సాధించింది. ఇటీవలే దశరద్ దర్శకత్వలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తారు. ప్రస్తుతం నాగార్జున శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వలో ‘డమరుకం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘షిర్డీ సాయి’ , రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘రామాయణం’ చిత్రాల్లో నటిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు