అక్కినేని నాగార్జున బిజీ బిజీగా మారిపోయారు. ఆయన నటించిన రాజన్న చిత్రం డిసెంబరు 23న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన దశరద్ దర్శకత్వంలో నటించబోయే చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సంతోషం’ భారీ విజయం సాధించింది. ఇటీవలే దశరద్ దర్శకత్వలో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తారు. ప్రస్తుతం నాగార్జున శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వలో ‘డమరుకం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘షిర్డీ సాయి’ , రామ్ గోపాల్ వర్మ తీయబోయే ‘రామాయణం’ చిత్రాల్లో నటిస్తారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “చిట్టి బాబు” రోల్ కి ఇన్ని డిఫెరెంట్ గెటప్స్ ట్రై చేసిన చరణ్!
- సమీక్ష : “ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)” – కొన్ని చోట్ల ఆకట్టుకునే సర్వైవల్ డ్రామా!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ హిట్ “ట్రూ లవర్”
- బజ్ : భారీ ధరకు అమ్ముడైన ‘కల్కి 2898 ఏడి’ హిందీ డిజిటల్ రైట్స్ ?
- లండన్ లో విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేసిన ప్రభాస్?
- “టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..
- స్పెషల్ : హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ ‘రామ్ చరణ్’