రాణాని పక్కనబెట్టిన రజిని

రాణాని పక్కనబెట్టిన రజిని

Published on Nov 25, 2011 12:26 AM IST

రజిని కాంత్ మరియు దీపికా పదుకొనే ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం ‘రాణా’. ఇపుడు ఈ చిత్రం అధికారికంగా కొంత కాలం నిలిపివేయబడింది. సౌందర్య రజినీకాంత్ మరియు ఎరోస్ సంస్థ ‘కోచాడైయాన్’ అనే పేరుతో ఒక చిత్రాన్ని రజినీకాంత్ హీరోగా నిర్మించాబోతునట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో ఆసక్తికరమయిన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. ఇండియాలో ఈ టెక్నాలజీ వాడటం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు జేమ్స్ కామెరాన్ ‘అవతార్’ చిత్రానికి మరియు స్పీల్ బెర్గ్ ‘టిన్ టిన్’ చిత్రానికి ఈ టెక్నాలజీని ఉపయోగించారు.

కోచాడైయాన్ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా సౌందర్య రజినీకాంత్ మరియు ఎరోస్ సంస్థ నిర్మిస్తునారు. ఈ చిత్ర విడుదల తరువాత రజినీకాంత్ రాణా చిత్ర షూటింగ్లో పాల్గొంటారని ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో సౌందర్య తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు