శర్వానంద్ నటించిన తెలుగు సినిమా విడుదలై దాదాపుగా సంవత్సరం దాటిపోయింది. శర్వానంద్ స్క్రిప్ట్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాడు అనే విషయం తెలిసిందే. అతను నటించిన చివరి సినిమా ‘అందరి బంధువయ’ 2010 లో విడుదలైంది. ఈ సినిమా తరువాత ఎం. శరవణన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఎంగేయుం ఎప్పోధం’ (తెలుగులో జర్నీ) ఒక్క సినిమా మాత్రమే చేసారు. ఈ సినిమాని మురుగదాస్ నిర్మించారు. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా చేస్తుంది. ఇది కాకుండా ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రహణం, అష్టా చెమ్మా, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో
మంచి డైరెక్టర్ గా నిరూపించుకున్నారు మోహనకృష్ణ. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించనుండగా, భాస్కర్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు. దీనికి సంబంచిన వివరాలను త్వరలో అధికారికంగా తెలియచేస్తారు.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో శర్వానంద్
Published on Dec 4, 2011 10:40 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : రత్నం – సిల్లీ యాక్షన్ ఎంటర్ టైనర్!
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?