త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ రోల్ ?

త్రివిక్రమ్ సినిమాలో స్పెషల్ రోల్ ?

Published on Aug 16, 2020 11:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాస్తున్నాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని.. అయితే మోహన్ లాల్ పాత్రలో కాస్త నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని.. తాను నమ్మిన దాని కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే ఈ పాత్రలో మరి మోహన్ లాల్ నటించడానికి అంగీకరిస్తాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట.

అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వచ్చే ఏడాది నుండి షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా 2022 సంక్రాతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు