ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం అన్నీ ఉన్న సినిమా ‘మోసగాళ్లు’ – మోహన్ బాబు

ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం అన్నీ ఉన్న సినిమా ‘మోసగాళ్లు’ – మోహన్ బాబు

Published on Mar 16, 2021 3:00 AM IST

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తాజాగా రూపొందించిన సినిమా ‘మోసగాళ్లు’. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, మంచు విష్ణు అక్కా త‌మ్ముళ్లుగా నటిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 19 క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల కాబోతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి గురుంచి మాట్లాడుతూ మీరు చాలా గొప్ప నటులు అని, మీ సినిమాలు నేను చూస్తుంటాను. మీకు విష్ణు అవకాశం ఇవ్వలేదు.. విష్ణుకే మీరు అవకాశం ఇచ్చారని అన్నారు. ఇక కాజల్ ఎంత మంచి నటి అన్నది అందరికి తెలిసిందేనని, మంచు విష్ణు పక్కన అక్కగా నటించేందుకు ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఆ పాత్రను ఒప్పుకున్నందుకు నిజంగా ఆమెను ప్రశంసిస్తున్నానని అన్నారు. అయితే నాకు మంచి తెలివితేటలున్నాయ్ నేను మోసపోను అని చాలా మంది చెబుతుంటారని, జీవితంలో ప్రతీ వ్యక్తి ఏదో ఒక విధంగా మోసపోతారని అన్నారు. భారతదేశంలో ఇటువంటి స్కాం ఇప్పటి వరకు జరగలేదని, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న యువత పక్కాగా చూడాల్సిన సినిమా ఇదని, అలాంటి కథను ధైర్యం చేసి విష్ణు తీశాడని చెప్పుకొచ్చారు. దాదాపు ఏడాది పాటు పరిశోధన చేశారని, తల్లిదండ్రులు పడిన అవమానం భరించ లేక ఆ అక్కాతమ్ముడు ఇలా మోసం చేస్తుంటారని, అక్కాతమ్ముడి సీన్స్ చూసి కంటతడి పెట్టేశానని మోగన్ బాబు అన్నారు. ఫ్యామిలీ, సెంటిమెంట్స్, అర్థం, పరమార్థం ఉన్న సినిమా ఇదని, మార్చి 19న నా పుట్టిన రోజు అందుకే ఈ మూవీని ఆ రోజు రిలీజ్ చేసేలా విష్ణు ప్లాన్ చేశాడని, ఈ మూవీ హిట్ అవ్వాలని ఆ దేవుళ్లను కోరుకుంటున్నానని, సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.

దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘మా విష్ణు ఫంక్షన్ అంటే సొంత ఫంక్షన్ లెక్క అని, మోహన్ బాబు నాకెంతో ఇష్టమైన వ్యక్తి అని అన్నారు. మోసగాళ్లు అనే సినిమాను అద్భుతంగా మంచు విష్ణు మలిచాడని, కాజల్ లాంటి అమ్మాయిని కమర్షియల్‌గా కాకుండా కథ పరంగానే వాడుకున్నారని, గ్లామర్‌గా ఎక్కడా కనిపించకుండా తీశారు. నిజాయితీ అంటే అదేనని, హీరోగా ఇంత మంచి పేరు సంపాదించుకున్నా కూడా ఈ సినిమాలో ఇలాంటి పాత్ర పోషించడం మామూలు విషయం కాదని అన్నారు. మంచు విష్ణు మేకింగ్, నటించిన విధానానికి హ్యాట్సాఫ్ అని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

రాజా రవీంద్ర మాట్లాడుతూ అన్నయ్య (మోహన్ బాబు) నాకు పెదరాయుడు సినిమాలో తమ్ముడి వేషాన్ని ఇచ్చాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య అదే రిలేషన్ ఉందని, మంచు విష్ణు కూడా ప్రతీ సినిమాలో వేషం ఇస్తుంటారు.. మోసగాళ్లు సినిమాలోనూ మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ ‘మోసగాళ్లు సినిమా మొత్తం 4200 కోట్లు చుట్టు తిరుగుతుంది. అది ఎక్కడ దాచి పెట్టారో విష్ణు, కాజల్‌లు చెప్పాలి. దాంట్లో పది శాతం కలెక్షన్లు రావాలని నేని కోరుకుంటున్నానని, ఈ సినిమా కోసం ఓ నాలుగు సీన్స్ రాశాను. అలా రాసినందుకు ఇంటికి వెళ్లే సరికి అకౌంట్‌లో మంచి అమౌంట్ పడిందని, అలా మోసగాళ్ల కోసం రాసిన సీన్స్‌తో సన్ ఆఫ్ ఇండియా సినిమా అవకాశం వచ్చిందని, ఈ సినిమా వల్ల మొదటగా లాభపడింది నేనేనని, ఈ సినిమా మంచి హిట్ సాధించాలని తొలుత కోరుకునేది కూడా తానేనని అన్నారు.

స్టంట్ శివ మాట్లాడుతూ ముందుగా మంచు విష్ణుకి థ్యాంక్స్ అని సూర్యం సినిమాతో మా ప్రయాణం మొదలైందని, ఢీ కూడా చేశానని, ఇప్పుడు మోసగాళ్లు చేశానని వారితో పని చేస్తే ఓ ఫ్యామిలీతో పని చేసినట్టు అనిపిస్తోందని, ఈ సినిమాకు పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

నవదీప్ మాట్లాడుతూ మోహన్ బాబు ముందు ఇలా మాట్లాడటం మొదటిసారి అని మీ ముగ్గురు పిల్లలు నాకు మంచి ఫ్రెండ్స్ అని ఓ మనిషికి అన్నం పెట్టి వారి కళ్లలో ఆనందాన్ని చూసి వీళ్లు ఆనంద పడుతుంటారని అన్నారు. ఇంగ్లీష్ తెలుగులో కలిపి ఈ మూవీని తెరకెక్కించామని, ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డాడో నాకు తెలుసు. పదిహేనేళ్ల తరువాత గుడికి వెళ్లాను అక్కడ కూడా ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకున్నానని, ఈ సినిమాలో నాకు మోసం జరిగింది. సునీల్ శెట్టి కాంబినేషన్‌లో నాకు సీన్స్ లేవు. కాజల్‌తో ఇది నాకు ఆరో సినిమా అని, ఆమెతో పని చేయడం ఎంతో అద్భుతంగా ఉందని, ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అని మార్చి 19న ఈ మూవీనీ ప్రతి ఒక్కరు చూడాలని కోరారు.

ఇక సునీల్ శెట్టి మాట్లాడుతూ మోహన్ బాబు నాకు సోదరుడులాంటి వారని, ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టమని, ఆయన ఫ్యామిలీతో కలిసి పని చేయడమంటే నా కల నెరవేరినట్టుందని అన్నారు. ఈ మూవీ ఆఫర్ రావడం నాకు చాలా ఆనందంగా ఉందని, మార్చి 19న మాకు ఎంతో ప్రత్యేకం అని ఈ మూవీ హిట్ అవుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ మోహన్ బాబు గారు, సునీల్ శెట్టి గారు ఈ సినిమా వెనకాల ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని నా పెళ్లి తరువాత ఇలా మొదటి సారి ఈ సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నానని, ప్రతీ ఒక్కరు కోవిడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారని, మేమేంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశామని అన్నారు.

రానా మాట్లాడుతూ నాకు విష్ణు ఫోన్ చేసి బెదిరించాడని అందుకే ఈ ఈవెంట్‌కు వచ్చానని, నేను చిన్నప్పటి నుంచి సునీల్ శెట్టికి అభిమానిని అని ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన సినిమా చూసి కండలు పెంచాలని ఫిక్స్ అయ్యానని చెప్పారు. మార్చి 19న మోహన్ బాబు గారి బర్త్ డే అని, ఆ రోజే విడుదలవుతున్న ఈ మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని, చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

ఇక హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా కోసం అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు సునీల్ శెట్టి గారికి థ్యాంక్స్ అని, మీతో పని చేసిన ప్రతీ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. మా అక్క కాజల్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ అని, టాప్ పొజిషన్‌లో ఉన్న ఓ నటి ఇలా అక్క పాత్రను చేయడం మామూలు విషయం కాదని, కథ పంపించగానే అను పాత్ర బాగుందని తను చెప్పిందని అన్నారి. నవదీప్ అద్భుతమైన నటుడని, నవీన్ చంద్ర బాగా నటించాడని, గౌతం రాజు గారు చేసిన ఎడిటింగ్‌ను ఇంగ్లీష్ వాళ్లు కూడా తీసుకున్నారని అన్నారు. ఇక్కడ అద్భుతమైన ప్రతిభ ఉందని, అక్కడ కొన్ని సమస్యలున్నాయని అంటే స్టంట్ శివ వెంటనే అమెరికా వచ్చి చేశారని, ఇక శ్యాం గారు చక్కని సంగీతాన్ని అందించారని, సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అని అన్నారు. మార్చి 19న సినిమా రాబోతున్న మా ఈ సినిమాను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు