సినిమా ఆపేయమని బాలక్రిష్ణకు నోటీసులు !

సినిమా ఆపేయమని బాలక్రిష్ణకు నోటీసులు !

Published on Jun 28, 2018 6:33 PM IST

క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ పై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుటుంబ సభ్యులు నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి తమను ఎవరూ సంప్రదించలేదని, కావాలని ఉద్దేశ్యపూర్వకంగానే తమను ఈ చిత్రంలో నెగిటివ్‌గా చూపించనున్నారని ఆరోపిస్తూ సినిమా నిర్మాణాన్ని ఆపాల్సిందిగా బాలక్రిష్ణకు నోటీసులు పంపారు.

ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మొదట ఎమ్మెల్యే హోదాలో నోటీసు పంపి, మళ్లీ చిత్రంలోని ప్రధాన నటుడు మరియు నిర్మాత హోదాలో ఇంకో నోటీసు పంపారు. అలాగే దర్శకుడు క్రిష్‌కు కూడా నోటీసు పంపినట్టు తెలుస్తోంది. మరి నందమూరి బాలకృష్ణ ఈ నోటీసుల పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు