‘ఏ మాయ చేశావే’ మ్యాజిక్ కాంబినేషన్ అయిన నాగ చైతన్య, గౌతమ్ మీనన్లు కలిసి తాజాగా మరో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఏ మాయ చేశావేతో ఓ అందమైన లవ్స్టోరీని అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్తో రానున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకు ఓ టైటిల్ ఫిక్స్ కాలేదు. క్రేజీ కాంబినేషన్ కావడంతో రకరకాల టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఫైనల్గా సినిమా యూనిట్ ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ సినిమా తమిళ వర్షన్లో శింబు హీరోగా నటిస్తున్నారు. మంజిమా మోహన్ రెండు వర్షన్స్లోనూ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక నాగార్జున బర్త్డే అయిన ఆగష్టు 29న ఈ సినిమా టీజర్ను విడుదల చేయనున్నారు. ఆగష్టు 29 సాయంత్రం 4 గంటలకు ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ఈ టీజర్ను విడుదల చేయనున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కెరీర్లో మరచిపోలేని సినిమా అయిన ‘ఒక్కడు’లోని ‘నువ్వేం మాయ చేశావో’ పాట గౌతమ్ మీనన్ – నాగ చైతన్యల మొదటి సినిమాకు టైటిల్ కాగా, ఇప్పుడు రెండో సినిమాకూ అదే సినిమాలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే పాట ఈ రెండో సినిమాకు టైటిల్గా మారడం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.