అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు డైరెక్షన్లో తన నెక్స్ట్ చిత్రాన్ని రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మిస్టిక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చూతూ సరికొత్త లుక్తో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది. అయితే, ఈ సినిమాతో పాటు చైతూ పేరు మరో సినిమాలో కూడా వినిపిస్తోంది.
దర్శకుడు దేవా కట్టా తెరకెక్కిస్తున్న ‘మయసభ’ అనే సినిమాలో నాగచైతన్య నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు. తను డైరెక్ట్ చేస్తున్న ‘మయసభ’ చిత్ర షూటింగ్ పూర్తయ్యిందని.. ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ఇందులో చైతన్య రావు కూడా నటిస్తున్నాడని.. ఆయన పేరును నాగ చైతన్యతో కంపేర్ చేస్తూ తప్పుడు ప్రచారం సాగుతోందని దేవా కట్టా క్లారిటీ ఇచ్చారు.
ఇక ‘మయసభ’లో సాయి కుమార్, నాజర్, దివ్యా దత్తా, తాన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఆయన తెలిపారు.