‘సవ్యసాచి’ కి గుమ్మడికాయ కొట్టే రోజు వచ్చింది !

‘సవ్యసాచి’ కి గుమ్మడికాయ కొట్టే రోజు వచ్చింది !

Published on Sep 19, 2018 8:58 AM IST

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. కొన్ని సీన్స్ లో ప్యాచ్‌ వర్క్‌ కు సంబంధించిన భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే గురువారం నాటికి కల్లా మొత్తం వర్క్ పూర్తవుతుందని, ఆ రోజే గుమ్మడికాయ కూడా కొడతారని సమాచారం.

కాగా ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్ అయిన ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయితు’ అనే సాంగ్‌ ను ఈ సినిమాలో రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పాటను నాగ చైతన్య, నిధీ అగర్వాల్‌ పై షూట్ చేశారు. వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థనే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ను అందిస్తోంది. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు