సవ్యసాచి టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది !

సవ్యసాచి టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది !

Published on Sep 30, 2018 3:00 AM IST

‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈచిత్రం షూటింగ్ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఇక అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం యొక్క టీజర్ విడుదలకు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 1న ఉదయం 10గంటలకు ఈ టీజర్ ను విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. అలాగే టీజర్ డేట్ తో పాటు సినిమాలోని చైతు స్టిల్ ను కూడా విడుదలచేసింది.

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నఈచిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు భూమిక , మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు