కొత్త దర్శకులను ఎక్కువగా నమ్ముతున్న నాగ శౌర్య !

కొత్త దర్శకులను ఎక్కువగా నమ్ముతున్న నాగ శౌర్య !

Published on Jun 23, 2018 3:47 PM IST

ఇటీవలే ‘ఛలో’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని నూతన దర్శకుడి పరిచయం చేసిన యువ హీరో నాగ శౌర్య ఇకపై కూడ కొత్త దర్శకులతో వరుస సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే డెబ్యూ దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ‘నర్తనశాల’ అనే సినిమాను చేస్తున్న ఆయన ఈరోజు మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు.

ఈ సినిమాను రాజా కొలుసు కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నారు. ఆగస్టు నుండి ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చేయనున్నాడు. ఈ చిత్రంలో కథానాయిక ఎవరు, చిత్రం ఎలా ఉండబోతుంది వంటి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు