‘బాలయ్య’ చిన్న అల్లుడు శ్రీ భరత్ కోటి విరాళం !

‘బాలయ్య’ చిన్న అల్లుడు శ్రీ భరత్ కోటి విరాళం !

Published on Apr 3, 2020 3:37 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కరోనా పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు బాలయ్య చిన్న అల్లుడు గీతం యూనివర్సిటీ, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ రూ. కోటి రూపాయిలను విరాళంగా ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి రూ. 50 ల‌క్ష‌లు, తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ. 25ల‌క్ష‌లు, అలాగే కర్ణాటక ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి మరో రూ. 25 ల‌క్ష‌లను భరత్ విరళంగా అందిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు ప్రకటించిన ఫండ్ ను కేటీఆర్ ను కలిసి అందజేశారు. ఇక బాలయ్య బాబు కూడా కోటి ఇరవైదు లక్షలను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

కాగా క‌రోనా వ్యాప్తి నిరోధం విష‌యంలో రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తున్నాయి. ప్ర‌భుత్వాల స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌జ‌లంద‌రూ తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌ని పలువురు సినీ ప్రముఖులు కోరుతున్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిని స‌మ‌ష్టిగా ఎదుర్కోవాలి, అంద‌రూ ఇళ్ల‌ల్లోనే సుర‌క్షితంగా ఉండాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు