వెబ్ సిరీస్ పూర్తయ్యాకే సినిమా !

వెబ్ సిరీస్ పూర్తయ్యాకే సినిమా !

Published on Oct 18, 2019 2:01 AM IST

నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా హిట్ చిత్రంగా నిలిచింది. దాంతో నందిని రెడ్డి తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక నందిని రెడ్డి
‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.

కాగా ప్రస్తుతం నందిని ఓ వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ పూర్తయ్యాక ఆ సినిమా మొదలెట్టనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ అట. ఈ చిత్రాన్ని ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ‘మహానటి మరియు ఓ బేబీ’ చిత్రాలకు అద్భుతమైన మనోహరమైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి కూడా సంగీతం అదించనున్నారు. ఇక ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు