వైరల్ అవుతోన్న ట్రైలర్ !

వైరల్ అవుతోన్న ట్రైలర్ !

Published on Aug 28, 2019 5:41 PM IST

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రివెంజ్‌ రైటర్‌ పెన్సిల్‌ గా ఈ సినిమాలో నాని ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ లో కనిపిస్తారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు.

కాగా ట్రైలర్ వైరల్ గా మారింది. ముఖ్యంగా ట్రైలర్ లో ఆడియన్స్‌ లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేసే డైలాగ్స్‌ ఉండటం, అలాగే ఎంటర్‌టైన్‌ చేసే సన్నివేశాలు, ఆకట్టుకునే సిట్యుయేషన్స్‌ ఈ ట్రైలర్‌ లో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే.. పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఆకలేస్తే అక్షరాలు తింటాం.. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం..’, ‘యుద్ధానికి సిద్ధం కండి… సమరశంఖం నేనూత్తాను’, ‘నేనింకా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఉన్నాను.. అంటూ నాని చెప్పే డైలాగ్స్‌ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న కార్తికేయ లుక్‌ కూడా బాగుంది. నాని, కార్తికేయలతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయట. లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌ చాలా ఎంటర్‌టైనింగ్‌ గా ఉంటాయట.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు