సీత వస్తేనే.. ఆ బయోపిక్ మొదలవుతుందట !

సీత వస్తేనే.. ఆ బయోపిక్ మొదలవుతుందట !

Published on May 13, 2019 9:00 PM IST

‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ ను నిర్మించాలని ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపొయింది. కానీ ఇప్పటికీ ఆ బయోపిక్ మాత్రం మొదలవ్వలేదు. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రానున్న ఈ బయోపిక్ కనీసం సీత రిలీజ్ తరువాతే మొదలయ్యేలా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని కూడా ఆ మధ్య ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ వచ్చింది.

ఇంతకీ ఎవరు ఈ ‘టైగర్ నాగేశ్వర్రావు’ అని అనుకుంటున్నారా.. ? ఇప్పటి తరానికి ఆయన పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి ఆయన బయోపిక్ అంటే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు