‘సర్కారు వారి’ షూట్ పై నయా అప్డేట్ ఇదే.!

‘సర్కారు వారి’ షూట్ పై నయా అప్డేట్ ఇదే.!

Published on Aug 29, 2021 11:18 AM IST


ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న సాలిడ్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారు పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇటీవల గోవాలో ఒక కీలక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని చిన్న బ్రేక్ లో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం షూట్ పై లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం సర్కారు వారి పాట నెక్స్ట్ షెడ్యూల్ షూట్ రేపటి నుంచి స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూట్ ఇక్కడ హైదరాబాద్ లోనే జరగనుందట. ఈ సీన్స్ లో మహేష్ సహా ఇతర కీలక నటులు పాల్గొననున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారితో సూపర్ స్టార్ మహేష్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు