సెప్టెంబర్ లో అనుష్క ‘నిశ్శబ్దం’ ?

సెప్టెంబర్ లో అనుష్క ‘నిశ్శబ్దం’ ?

Published on Aug 2, 2020 12:11 AM IST

అనుష్క ప్రధాన పాత్రలో రాబోతున్న ‘నిశ్శబ్దం’ ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్. ఈ సినిమా సెప్టెంబర్ లో ఓటిటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా మూడుసార్లు వాయిదా పడింది. జనవరి నుండి పోస్ట్ ఫోన్ అయి, ఇక ఎట్టకేలకు ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు, కరోనా వల్ల లాక్‌డౌన్ రావడం, ఆ తరువాత ఓ ప్రముఖ ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లో జూలైలో విడుదల అవుతుందనుకున్నా అవ్వలేదు. ప్రస్తుతం మేకర్స్ కొన్ని ఓటిటీ ప్లాట్‌ ఫామ్‌ లతో చర్చలు జరుపుతున్నారట. ఆ చర్చలు ఓకే అనుకుంటే సెప్టెంబర్ లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది. మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మరో సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు