‘బర్త్ డే’కి పాత చిత్రాన్నే కొత్తగా ఎనౌన్స్ మెంట్ !

‘బర్త్ డే’కి పాత చిత్రాన్నే కొత్తగా ఎనౌన్స్ మెంట్ !

Published on Mar 21, 2019 6:22 PM IST

తన బర్త్ డే సందర్భంగా నితిన్ తాను చేయబోతున్న చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నాడు. మార్చి 30 నితిన్ పుట్టిన రోజు. కాగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించినడానికి నితిన్ ఎప్పుడో అంగీకరించాడు. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక.

అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ చిత్రం ఎట్టకేలకూ త్వరలో పట్టాలెక్కనుంది. ఉగాది నుండే ఈ చిత్రం షూటింగ్ కి వెళ్లనుంది. ఇక అప్పుడెప్పుడో ఒప్పుకున్న ఈ చిత్రాన్ని తన ‘బర్త్ డే’ సందర్భంగా నితిన్ కొత్తగా ఎనౌన్స్ చేయనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తి అయింది. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు.

ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు