ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ప్రముఖ రచయిత !

ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ప్రముఖ రచయిత !

Published on Nov 8, 2018 6:00 PM IST

బాలకృష్ణ నిర్మాణంలో.. క్రిష్ దర్శకత్వంలో ‘నందమూరి తారకరామారావు’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ పార్ట్స్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అలనాటి సాంకేతిక నిపుణులు మరియు నటీనటుల పాత్రలు ఉన్న ఈ చిత్రంలో.. ఆ పాత్రల స్థాయికి తగట్లుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది.

కాగా ఈ చిత్రంలో ఆ కాలం లెజండరీ మేకప్ మెన్ పాత్రను కూడా చూపించనున్నారు. అప్పటి గొప్ప మేకప్ మేన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పీతాంబరం పాత్రలో రచయిత సాయి మాధవ్ బుర్రా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో సాయి మాధవ్ పై చిత్రీకరణ కూడా జరిపిందట చిత్రబృందం. ఎన్టీఆర్ మొదటి సినిమా నుండి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేంతవరకు ఆయనకు మేకప్ మేన్ పీతాంబరమే కావడం విశేషం.

ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే పాటలు అన్ని కూడా పూర్తి చేశారని.. అద్భుతంగా వచ్చాయని కీరవాణి కెరీర్ లో మరో సూపర్ హిట్ ఆల్బమ్ అని నిలుస్తోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు