ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఈవెంట్ వేదిక మారింది !

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఈవెంట్ వేదిక మారింది !

Published on Dec 17, 2018 5:55 PM IST

లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్ టి ఆర్’. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈచిత్రం లో విద్యాబాలన్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈచిత్రం యొక్క ఆడియో వేడుక డిసెంబర్ 21న జరుగనుందని తెలిసిందే. అయితే మొదటగా ఈ వేడుకను ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు లో జరుపాలని భావించిన చిత్ర బృందం తాజాగా ఈ ఈవెంట్ ను హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు షిఫ్ట్ చేశారని సమాచారం. అయితే దీనికి గల కారణాలు తెలియాల్సి వుంది.

క్రిష్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం రెండు భాగాలుగా రానుంది. అందులో మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదలకానుండగా రెండవ భాగం’మహానాయకుడు’ జనవరి 24న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు