చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ !

చిత్రలహరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ !

Published on Mar 27, 2019 2:29 PM IST

‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘చిత్రలహరి’ విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నాడని సమాచారం. అతి త్వరలోనే ఈ ఈవెంట్ గురించి అధికారిక ప్రకటన వెలుబడనుంది.

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ , సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజు సరసన కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఏప్రిల్12 న విడుదలకానున్న ఈ చిత్రం ఫై సాయి తేజ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు