మే 20 నుండి ‘అయినను పోయి రావలె హస్తినకు’ !

మే 20 నుండి ‘అయినను పోయి రావలె హస్తినకు’ !

Published on Jan 25, 2021 4:34 PM IST

‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే మొదలుకావాల్సిన ఈ సినిమా కోవిడ్ అండ్ కొన్ని కారణాల కారణంగా పోస్ట్ ఫోన్ అయింది. కాగా తాజాగా ఈ సినిమా తారక్ పుట్టినరోజు మే 20 నుండి అధికారికంగా మొదలుకానుంది, షూటింగ్ కూడా అదే రోజున స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని తెలుస్తోంది.

ఇక ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు.. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు