ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్!

ఉదయ్ కిరణ్ “నువ్వు నేను” రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్!

Published on Mar 18, 2024 8:40 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి ఉదయ్ కిరణ్ కొంత కాలం క్రితం నువ్వు నేను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనిత హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సునీల్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటించగా, ఆర్ పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు ఆర్.పి.పట్నాయక్.

ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా మామూలు సినిమాగా 2001 వ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు కూడా జోరుగా పెరిగాయి. చివరగా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి ఆ సమయంలో పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర తిరగరాసింది.

ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ కాబోతొంది. ఈ సంవత్సరం మార్చి 21న థియేటర్స్ లో రీ రిలీజ్ అవుతుంది నువ్వు నేను. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల అయ్యింది. అలాగే బుక్ మై షో పేటిఎం లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు