టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ సీక్వెల్ మూవీ ‘ఓదెల 2’ ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. సంపత్ నంది టీమ్ నుంచి తెరకెక్కిన ఈ సినిమాను అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా పూర్తి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ అందుకుంది. అయితే, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ వసూళ్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. ముఖ్యంగా తొలిరోజు కంటే కూడా ఈ సినిమాకు వీకెండ్లో వసూళ్లు పెరిగాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా నాలుగు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రూ.8.88 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ సినిమాలో తమన్నా పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ సింహా, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు.