నెలరోజులపాటు ఆలస్యమైన మహేష్ సినిమా షూట్ !

నెలరోజులపాటు ఆలస్యమైన మహేష్ సినిమా షూట్ !

Published on Jun 30, 2018 9:33 AM IST

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న కొత్త సినిమా డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సుమారు రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ జరగాల్సి ఉంది. కానీ మధ్యలో ఇంటర్నేషనల్ యోగా డే రావడం మూలాన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో ప్రధాని మోదీ యోగా కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందుకోసం సుమారు నెలరోజుల ముందుగానే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను భద్రత దృష్ట్యా అక్కడి అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అక్కడ జరగాల్సిన మహేష్ సినిమా షూట్ నెల రోజులపాటు ఆలస్యమైందట. ఈ ఆలస్యానికి కారణం మంచిదే కాబట్టి తాము ఎలాంటి నిరుత్సాహానికి గురికాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది.

దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రైతు సమస్యల నేపథ్యంలో ఉండనున్న ఈ సినిమాలో మహేష్ విద్యార్థి పాత్రలో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు