మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన ‘మసూద’

మూడేళ్ల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చిన ‘మసూద’

Published on Apr 23, 2025 3:01 PM IST

టాలీవుడ్‌లో హార్రర్ చిత్రాల్లో కల్ట్ ఫాలోయింగ్ దక్కించుకున్న చిత్రం ‘మసూద’. దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ సినిమా తనదైన గ్రిప్పింగ్ నెరేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో తిరువీర్, సంగీత తమ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను అలరించారు. అయితే, ఈ సినిమా మూడేళ్ల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది.

ఇప్పటికే ‘మసూద’ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ఇప్పుడు మరింత రీచ్ వస్తుందని అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాకు రావాల్సిన గుర్తింపు దక్కలేదని.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయితే, ఈ చిత్రం గ్లోబల్‌గా ఆడియెన్స్‌ను రీచ్ అవుతుందని వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా ప్రొడ్యూస్ చేయగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. మరి ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు