ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ లేటెస్ట్ చిత్రం

ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ లేటెస్ట్ చిత్రం

Published on Apr 18, 2025 12:39 PM IST


విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా తుషార విజయన్ హీరోయిన్ గా దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించిన సాలిడ్ రూరల్ యాక్షన్ డ్రామా చిత్రం “వీర ధీర శూర పార్ట్ 2”. మరి తమిళ్ సహా తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ రన్ ని అందుకుంది. ఇక ఫైనల్ గా థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా వీరు ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ డేట్ ఇచ్చేసారు. దీనితో ఈ సినిమా ఈ ఏప్రిల్ 24 నుంచి అందుబాటులో ఉండనున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో అప్పుడు మిస్ అయ్యినవారు ఇపుడు ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో 30 ఇయర్స్ పృథ్వీ అలాగే ఎస్ జే సూర్యలు సాలిడ్ పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా రియా శిబూ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు