ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గోపిచంద్ “భీమా”?

ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గోపిచంద్ “భీమా”?

Published on Mar 28, 2024 7:03 AM IST

టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా కన్నడ మాస్ దర్శకుడు హర్ష తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామానే “భీమా”. మాస్ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం గోపిచంద్ కెరీర్ లో మరో సాలిడ్ మాస్ ప్రాజెక్ట్ గా నిలిచింది. అయితే ఈ శివరాత్రి కానుకగా వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీని ప్రకారం ఈ సినిమా ఈ ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా వినికిడి. ఈ సినిమా ఓటీటీ హక్కులు స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఆరోజు నుంచి రానున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా వెన్నెల కొషోర్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు