శర్వా – సాయి పల్లవి ల సినిమా వాయిదాపడనుందా ?

శర్వా – సాయి పల్లవి ల సినిమా వాయిదాపడనుందా ?

Published on Sep 26, 2018 4:28 PM IST

యువ హీరో శర్వానంద్, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఫేమ్ హను రాఘవ పూడిఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం యొక్క చివరి షెడ్యూల్ నేపాల్ లో జరిగింది. దాంతో చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదలకావడం లేదట. ముందుగా ఈచిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేస్తామని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు వున్నాయట. మరి ఈ వాయిదా పడడానికి గల కారణాలు తెలియాల్సి వుంది.

పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనేర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ఆటగాడిగా నటిస్తుండగా సాయి పల్లవి వైద్యురాలి పాత్రలో నటిస్తుంది. ఇక శర్వా ఈచిత్రం తోపాటు ‘స్వామి రారా’ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రంలోను నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కోసం ఆయన విదేశాలకు వెళ్ళనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు