పంజాలో బ్రహ్మి కామెడీ హైలెట్

పంజాలో బ్రహ్మి కామెడీ హైలెట్

Published on Dec 5, 2011 11:36 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 9న భారీ విడుదలకి సిద్ధమైంది. సెకండాఫ్ లో పవన్ కళ్యాణ్ మరియు బ్రహ్మానందం
మధ్య కామెడీ అధ్బుతంగా పండిందని యూనిట్ వర్గాల సమాచారం. వారి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలెట్ అవుతాయని, బ్రహ్మానందం మీద తీసిన పాట బాగా వచ్చాయని సమాచారం.

పంజా సినిమాకి ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేయగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాని పంజా కలకత్తా లో అత్యధిక భాగం చిత్రీకరించగా
సారా జేన్ డియాస్ మరియు అంజలి లవనియా హీరోయిన్లుగా నటించారు. పంజా సినిమాని నీలిమ తిరుమల శెట్టి మరియు శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు