నేడే పంజా సెన్సార్

నేడే పంజా సెన్సార్

Published on Dec 3, 2011 10:18 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పంజా చిత్రం అతి త్వరలో విడుదల కు సిద్ధం కాబోతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి కావస్తాయ్ అని సమాచారం. ఒకవేళ ఏమైనా కారణాల వలన నేడు సెన్సార్ పూర్తి కాకపోతే ఆదివారం రోజున పూర్తి అవుతుందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి ప్రఖ్యాత తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ మరియు నీలిమ తిరుమలశెట్టి సంయుక్తం గా నిర్మించిన ఈ చిత్రం లో సారా జేన్ డయాస్ మరియు అంజలి లవానియా కథానాయికలు. ప్రఖ్యాత సంగీత దర్శకులు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ప్రపంచవ్యాప్తం గా అతి భారీ గా విడుదల అయ్యేందుకు పంజా సిద్ధం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు