షూటింగ్ పూర్తి చేసుకున్న పంజా

షూటింగ్ పూర్తి చేసుకున్న పంజా

Published on Nov 27, 2011 7:53 PM IST


పవన్ కళ్యాణ్ మరియు మరికొంత మంది నటులతో పంజా చిత్రంలోని ఆఖరి సన్నివేశాన్ని ఈ రోజు చిత్రీకరించారు.ఈ చిత్రం ప్యాచ్ వర్క్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. ఆఖరి సన్నివేశం చిత్రీకరణ పూర్తయ్యాక చిత్ర నిర్మాతలు క్లాప్ బోర్డు పై సంతకం చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర రీరికార్డింగ్ మరియు ఫైనల్ మిక్సింగ్ పనులు చెన్నైలో జరుగుతున్నాయి. పంజాతో దర్శకుడు విష్ణు వర్ధన్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ జై అనే పాత్రలో కనిపించనున్నాడు. సారా జేన్, అంజలి లావానియ, జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణి మరియు అడివి షేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా సంఘమిత్ర ఆర్ట్స్ మరియు ఆర్కా మీడియా బ్యానర్ పై నీలిమ మరియు శోభు యార్లగడ్డ నిర్మించారు. పంజా చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 9 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు