కీరవాణి గారి మాతృమూర్తి మృతికి పవన్ నివాళులు

కీరవాణి గారి మాతృమూర్తి మృతికి పవన్ నివాళులు

Published on Dec 14, 2022 9:11 PM IST


ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కెరీర్ లో ఎన్నో సినిమాలతో సంగీత దర్శకుడిగా ఆడియన్స్ నుండి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, 2 అలానే ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీస్ కి సూపర్ మ్యూజిక్ అందించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకున్నారు కీరవాణి. అయితే విషయం ఏమిటంటే, కీరవాణి తల్లి భానుమతి గారు నేడు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. మూడు రోజుల క్రితం ఆమెకు ఆరోగ్యం ఎంతో ఇబ్బందికరంగా మారడంతో వెంటనే ఆమెను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యలు.

అయితే నేడు ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో డాక్టర్లు ప్రయ్నటించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఇక తల్లి మృతితో కీరవాణి ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భానుమతి గారి మృతికి నివాళులు అర్పిస్తుండగా కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. కీరవాణి గారి మాతృమూర్తి భానుమతి గారి అకాల మృతి విషయం తనను బాధించిందని, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపిన పవన్, ఇటువంటి సమయంలో ఆ భగవంతుడు కీరవాణి గారికి, ఆయన తండ్రి శ్రీ శివశక్తి దత్త గారికి, ఇతర కుటుంబసభ్యులు అందరికీ ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని అందించాలని కోరుతూ తన నోట్ లో తెలిపారు పవన్ కళ్యాణ్. కాగా భానుమతి గారి పార్థివదేహాన్ని రాజమౌళి గారి ఇంటికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు