పూజా హెగ్డే లాంచ్ చేసిన ‘డియర్ మేఘ’ సాంగ్.!

పూజా హెగ్డే లాంచ్ చేసిన ‘డియర్ మేఘ’ సాంగ్.!

Published on Jul 16, 2021 4:42 PM IST

యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ మరియు హీరో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని ‘ఆమని ఉంటే పక్కన..’ అనే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10.18 నిమిషాలకు ‘ఆమని ఉంటే పక్కన..’ లిరికల్ పాట లాంఛ్ చేసిన పూజా హెగ్డే చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.

అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన లవ్ సాంగ్ ఎలా ఉందో చూస్తే…. *ఆమని ఉంటే పక్కన…ఏమని చెప్పను భావన…పోతే మళ్లీ రాదనా…మళ్లీ మళ్లీ చూడనా..యే వానవిల్లో వేల రంగుల్లో కిందే వాలిందో…ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో..నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో…నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో.. అడుగు, అడుగు నీతోనే..ఆకాశం అంచుకు వెళుతున్నానే..మలుపు, మలుపు నీతోనే మనసులో నే నీకో గుడి కడుతున్నాలే* అంటూ ప్రేమను వర్షిస్తుందీ పాట.

హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ లో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ”డియర్ మేఘ” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక విభాగానికి వస్తే సంగీతం – హరి గౌర, సినిమాటోగ్రాఫర్ – ఐ ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ – కె.వి రమణ, పీఆర్వో – జి.ఎస్.కె మీడియా. నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి లు వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు