‘పడిపడి లేచె మనసు’ అప్పుడే అంత రికవరీ చేసింది !

‘పడిపడి లేచె మనసు’ అప్పుడే అంత రికవరీ చేసింది !

Published on Nov 24, 2018 12:59 PM IST

శర్వానంద్ ,సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనెర్ ‘పడి పడి లేచె మనసు’ ఈచిత్ర నిర్మాతలకు మంచి లాభాలను తీసుకరావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల ఈ చిత్రం యొక్క డిజిటల్ , శాటిలైట్ , హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తం కలుపుకొని 12కోట్లుకు అమ్ముడుపోయాయి. దాంతో చిత్రం యొక్క బడ్జెట్ లో 70 శాతం వెనక్కివచ్చేసిందని సమాచారం .

ఇక శర్వా , సాయి పల్లవి మొదటి సారి కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రానికి క్రేజ్ వుంది. దానికి తోడు ఈచిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడం పక్కా. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21 న ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు