ప్రభాస్ బృందం టైమ్ వేస్ట్ కానివ్వట్లేదు

ప్రభాస్ బృందం టైమ్ వేస్ట్ కానివ్వట్లేదు

Published on Mar 31, 2020 9:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ప్రభావంతో ఈ సినిమా శూటింగ్ ఆగింది. జార్జియాలో చిత్రీకరణ జరుపుతున్న టీమ్ లాక్ డౌన్ ప్రకటనతో కొంత షూట్ మిగిలి ఉండగానే ఇండియాకు తిరిగివచ్చేశారు. లాక్ డౌన్ ముగియగానే షూట్ వెంటనే రీస్టార్ట్ కానుంది. ప్రజెంట్ టీమ్ సభ్యులంతా సెల్ఫ్ ఐసోలేషన్ పాటిస్తున్నారు.

దీంతో మిగిలిన చిత్ర బృందం టైమ్ సేవ్ చెయ్యడం కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణ తాలూకు ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయట. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. షూట్ రీస్టార్ట్ కాగానే ఫస్ట్ లుక్ విడుదలచేయాలనే ఆలోచనలో ఉన్నారు టీమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు