ఫరెవర్ డిజైరబుల్ జాబితాలో ప్రభాస్

ఫరెవర్ డిజైరబుల్ జాబితాలో ప్రభాస్

Published on Jun 2, 2021 7:12 PM IST

టైమ్స్ సంస్థ ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను తయారుచేస్తుంటుంది. దానితో పాటే ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో ఇంకో జాబితాను ప్రకటిస్తుంది. ఈ జాబితాకు ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఇందులో చోటుంటుంది. ఈ క్లబ్‌లో చోటు దక్కినవాళ్ల పేర్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఉండదు. ఎందుకంటే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కొత్తవారికి చోటు కల్పించడం కోసమే.

ఈ జాబితాలో ఇప్పటివరకు టాలీవుడ్ నుండి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే ఇందులో చోటు దక్కించుకోగా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును అందులో చేర్చారు. ఇక తాజాగా 2020 సంవత్సరానికిగాను రెబల్ స్టార్ ప్రభాస్ పేరును కూడ ఆ లిస్టులో చేర్చారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తమైంది. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఆయనకు అభిమానులు పెరుగారు. ప్రజెంట్ ప్రభాస్ ‘రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్’ సినిమాలు చేస్తున్నారు. ఇవి కంప్లీట్ కాగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు