రెబల్ స్టార్ ప్రభాస్ తన 40 వ పుట్టినరోజును రేపు లండన్ లో చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సన్నిహితులు మరియు బాహుబలి టీమ్ అందరూ లండన్ లో ఉన్నారు. వారితో కలిసి ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. అయితే ప్రభాస్ లండన్ నుండి తిరిగి వచ్చాక తన తరువాత సినిమాకి సంబంధించి చర్చలు జరిపి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ఇప్పటికే, పరుశురామ్, సురేందర్ రెడ్డి మరియు కొంతమంది హిందీ దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇండియా రాగానే మొదట పరుశురామ్ కథ చెప్పబోతున్నాడట. మరి పరుశురామ్ చెప్పబోయే కథ నచ్చితే.. ప్రభాస్ – పరుశురామ్ కాంబినేషన్ లో సినిమా ఉండొచ్చు. ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో జాన్ సినిమాలో నటిస్తున్నాడు. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.