“హను మాన్” ఓటిటి రిలీజ్ పై ప్రశాంత్ వర్మ క్లారిటీ!

“హను మాన్” ఓటిటి రిలీజ్ పై ప్రశాంత్ వర్మ క్లారిటీ!

Published on Mar 15, 2024 11:27 AM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఓటిటి రిలీజ్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా లో పోస్ట్ ను షేర్ చేశారు. హనుమాన్ ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. మేము విషయాలను క్రమబద్ధీకరించడానికి మరియు వీలైనంత త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. మా ఉద్దేశ్యం ఎల్లప్పుడూ మీకు ది బెస్ట్ అందించడం తప్ప మరేమీ కాదు. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మాకు మద్దతు ఇవ్వడం కొనసాగించండి, ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ నెక్స్ట్ జై హను మాన్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు