దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా షూట్ ప్రారంభమైన కొన్ని రోజులకే ప్రియాంక చోప్రా తన సోదరుడి పెళ్లి కోసం షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ, తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. ఈ రోజు మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా పూర్తిస్థాయి షూటింగ్ ఏప్రిల్ లేదా మే నెల నుంచి కెన్యాలో స్టార్ట్ కాబోతుంది. ఆ దేశంలోని దట్టమైన అడవుల్లో ఈ సినిమా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు.
ఏదిఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.