మెగా డ్రీమ్ పై మనసులో మాట బయటపెట్టిన పూరి

మెగా డ్రీమ్ పై మనసులో మాట బయటపెట్టిన పూరి

Published on Aug 23, 2022 10:19 PM IST


టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫస్ట్ మూవీ బద్రితో పెద్ద సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక అక్కడి నుండి ఒక్కొక్కటిగా అవకాశాలతో దూసుకెళ్లిన పూరి, ఆపైన పోకిరి, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, దేశముదురు ఇలా అనేక బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మరింతగా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

ఇక లేటెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో ఆయన చేస్తున్న మూవీ లైగర్. భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన లైగర్ ఈనెల 25న భారీ స్థాయిలో విడుదల కానున్న సందర్భంగా పలువురు మీడియా వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన పూరి తన కెరీర్ తో తన డ్రీమ్ ప్రాజక్ట్ గురించి కూడా చెప్పారు. నేడు ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఇంటర్వ్యూలో భాగంగా పూరి మాట్లాడుతూ, లైగర్ పై తనకి, హీరో విజయ్ కి అలానే టీమ్ మొత్తానికి ఎంతో నమ్మకం ఉందన్నారు.

తప్పకుండా మూవీ అందరి అంచనాలు అందుకుని హిట్ కొడుతుందని పూరి అభిప్రాయపడ్డారు. ఇక తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ తో మూవీ చేసే అవకాశం ఇటీవల మిస్ అయిందన్నారు. వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 మూవీ సమయంలో ఆయనకు ఒక స్టోరీ చెప్పానని, అయితే అది పెద్దగా వర్కౌట్ కాలేదన్నారు. ఆయనతో ఎప్పటికైనా ఒక పవర్ఫుల్ మూవీ తీయాలనేది తన డ్రీమ్ అని, ప్రస్తుత తన కమిట్మెంట్స్ పూర్తి అయిన తరువాత తప్పకుండా ఆయన కోసం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేస్తానని అన్నారు పూరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు