
బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ‘బాద్షా’ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మొదటి సారి వక్కంతం వంశీ అందించిన కథకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2015 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఇది కాకుండా ఎన్.టి.ఆర్ – సమంత – ప్రణిత నటించిన ‘రభస’ సినిమా ఆగష్టు 29న పేక్షకుల ముందుకు రానుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

