ఘ‌నంగా `రాజ్ ధూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్ !

ఘ‌నంగా `రాజ్ ధూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్ !

Published on Jul 1, 2019 12:04 PM IST

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా… శాంతి శ్రీహ‌రి మాట్లాడుతూ, `మేఘాంశ్` భైర‌వ` సినిమాలో న‌టించాడు. అదే త‌న తొలి సినిమా. ఇది రెండ‌వ సినిమా. పాఠాలు చ‌ద‌వ‌డు. డైలాగులు పేజీలు బాగా చ‌దువుతాడు. అప్పుడే అర్ధ‌మైంది. నటన తన బ్ల‌డ్ లో నే ఉంది. శ్రీహ‌రిగారికి ఇచ్చిన స‌పోర్ట్ నా బిడ్డ‌ల‌కు ఇస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

హీరో మేఘాంశ్ మాట్లాడుతూ, `అమ్మ‌నాన్న‌ల వ‌ల్లే ఇక్క‌డ ఉన్నాను. డాడి లేక‌పోవ‌డంతో మ‌మ్మ‌ల్నిపెంచ‌డానికి అమ్మ చాలా క‌ష్ట‌ప‌డింది. ఇక సినిమా జులై 5న రిలీజ్ అవుతుంది. పైర‌సీ ఎంక‌రేజ్ చేయ‌కండి. థియేట‌ర్ కు వ‌చ్చి చూడండి` అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు