రాజన్న సినిమాని చుసిన నాగార్జున

రాజన్న సినిమాని చుసిన నాగార్జున

Published on Dec 3, 2011 11:10 PM IST


కింగ్ అక్కినేని నాగార్జున నేడు రాజన్న చిత్రాన్ని శబ్దాలయ స్టూడియోస్ లో వీక్షించారు. రాజన్న చిత్ర డి.టి.ఎస్. పనులు అక్కడ జరుగుతుండటం తో అయన అక్కడికి విచ్చేసి, చిత్రాన్ని తిలకించారు. అనంతరం నాగార్జున సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తెలంగాణా ప్రాంతంలో స్వాతంత్రం అనంతరం చోటు చేసుకున్న అక్రమాల మీద ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కీరవాణి సంగీతం అందించగా, స్నేహ కథానాయిక. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. పోరాట సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారు. నాగార్జున స్వయం గా నిర్మించిన ఈ
చిత్రం డిసెంబర్ 23 న విడుదల కు సిద్ధం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు