బాలయ్య మెమొరీ పవర్ తో మతిపోయింది – వంగ క్రేజీ కామెంట్స్

బాలయ్య మెమొరీ పవర్ తో మతిపోయింది – వంగ క్రేజీ కామెంట్స్

Published on Nov 26, 2023 8:08 AM IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ కొల్లి సాలిడ్ యాక్షన్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాతో పాటుగా బాలయ్య ఇపుడు తన ఓటిటి హిట్ షో అన్ స్టాప్పబుల్ లిమిటెడ్ ఎడిషన్ లో కూడా బిజీగా ఉన్నారు. అయితే ఈ షోలో రీసెంట్ గానే మోస్ట్ అవైటెడ్ వైల్డ్ ఎపిసోడ్ ని “యానిమల్” టీంతో బాలయ్య ముగించారు.

ఇక ఈ ఎపిసోడ్ కి హాజరైన టాలెంటెడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఆ షో చూసి తాను షాకయ్యను అని బాలయ్య గారి కోసం చాలా మందికి ఉన్న ఓ అభిప్రాయాన్ని ఈ షో మార్చింది అని చెప్పాడు. అలాగే అందులో బాలయ్య రణబీర్ తాత గారు చెప్పిన మొఘల్ ఈ అజమ్ డైలాగ్ చూసి రణబీర్ మతి పోయింది.

అని ఆ డైలాగ్ రణబీర్ కే పూర్తిగా గుర్తు లేదు అలాంటి దానిని బాలకృష్ణ గారు అంత పెద్ద డైలాగ్ ని ఎలా గుర్తు పెట్టుకున్నారు అనేది చూసి షాకయ్యను అని దీనితో ఆయన ఫ్యాన్ అయిపోయాను. అని పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సందీప్ వంగ అయితే చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు