నిన్న విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం అన్ని చోట్ల నుండి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటోంది. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం మూలాన ఓపెనింగ్స్ భారీ స్థాయిలోనే లభించాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 కోట్లకు పైగానే షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.32 కోట్ల వరకు షేర్ ను రాబట్టుకుంది.
ప్రాంతాల వారీగా లెక్కల్ని చూసుకుంటే ఈ కింది విధంగా ఉన్నాయి
| ఏరియా | వసూళ్లు |
| నైజాం | 4.43 కోట్లు |
| సీడెడ్ | 3.75 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 2.43 కోట్లు |
| గుంటూరు | 3.15 కోట్లు |
| కృష్ణ | 1.55 కోట్లు |
| ఈస్ట్ గోదావారి | 2.05 కోట్లు |
| వెస్ట్ గోదావారి | 1.60 కోట్లు |
| నెల్లూరు | 75 లక్షలు |
| మొత్తం | 19.71 కోట్లు |


